శ్రీవారి మేల్చట్ వస్త్రాలకు రూ.43.45 లక్షలు విరాళం
NEWS Sep 11,2025 12:09 pm
తిరుమల శ్రీవారికి ఒక సంవత్సరం పాటు వినియోగించే 55 సెట్ల మేల్చట్ వస్త్రాలకు అయ్యే రూ.43.45 లక్షలను వారణాసికి శ్రీ కాశీమఠం మఠాధిపతి శ్రీమద్ సమ్యమీంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో ఆ మఠం ప్రతినిధి కే.నారాయణ షెనోయ్ అనే భక్తుడు విరాళంగా అందించారు. ఈ విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.