జగిత్యాలకు చెందిన ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు
NEWS Sep 12,2025 11:49 am
జగిత్యాలకు చెందిన ఉపాధ్యాయుడు అడ్లగట్ట గంగాధర్ గణిత బోధనలో వినూత్న పద్ధతులు ఆవిష్కరించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గుజరాత్ అహ్మదాబాద్లో నిర్వహించిన ఇండియన్ స్కూల్ అవార్డ్స్ ఆయనకు అవార్డు లభించింది. రోబో స్కూల్ ఛాంప్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సంస్థ ఛైర్మన్ అక్షయ్ అహుజా గౌరవం అందజేశారు. అంగులియా అబాకస్ 2.0 విద్యార్థుల్లో గణితంపై భయం తొలగిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.