ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రాధాకృష్ణన్
NEWS Sep 12,2025 11:49 am
సీపీ రాధాకృష్ణన్ నూతన భారత దేశ ఉప రాష్ట్రపతిగా శుక్రవారం కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు హాజరయ్యారు. జరిగిన ఎన్నికలో మొత్తం 781 ఓట్లకు గాను సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు పోల్ కాగా ప్రధాన ప్రత్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.