నిర్మల్ జిల్లా కేంద్రంలో ZPSS రత్నాపూర్ కాoడ్లీ 2012-13 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరే గత స్మృతులను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులను పూలమాల, శాలువా మెమెంటోలతో సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమ వద్ద విద్యాబుద్ధులు నేర్చిన చిన్నారులు తమను గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించడం మరువలేనిదని సంతోషం వ్యక్తం చేశారు.