ప్రజాపాలన ప్రగతి పాలన
NEWS Apr 16,2026 01:34 pm
కోరుట్ల: అయిలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల సందర్భంగా మండల మీటింగ్ ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన చేసి ప్లాస్టిక్ ను నిషేధించాలని పిలుపు నిచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఎమ్మార్వో కృష్ణ చైతన్య, ఎంపీఓ రాజేష్, కోరుట్ల మార్కెట్ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మండల సర్పంచ్ లు, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, అంగన్వాడి టీచర్ లు, ప్రజలు పాల్గొన్నారు.