టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?
NEWS Apr 16,2026 01:30 pm
భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2026లో 2 అర్ధ శతకాలు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్న అతడి పేరు ఐర్లాండ్ పర్యటన కోసం సిద్ధం చేసిన 35 మంది లిస్టులో చోటు దక్కినట్టు సమాచారం. ఇప్పటికే అభిషేక్, ఇషాన్, సంజూ, జైస్వాల్ వంటి ఓపెనర్లు పోటీలో ఉండడంతో ఎంపిక క్లిష్టమైంది. కెప్టెన్ సూర్యకుమార్ పేలవ ఫామ్ కూడా సెలక్షన్పై ప్రభావం చూపే అవకాశముంది.