KGBV ఘటనపై విచారణకు BJP డిమాండ్
NEWS Apr 23,2026 01:10 pm
నందవరం KGBV హాస్టల్లో బల్లి పడిన భోజనం విద్యార్థులకు వడ్డించారన్న ఆరోపణలతో కలకలం రేగింది. ఈ విషయాన్ని ముందుగానే తెలిపినా పట్టించుకోలేదని, బెదిరింపులు చేశారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఘటనతో పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్ డిమాండ్ చేశారు. అయితే ప్రిన్సిపల్ మాత్రం అది బల్లి కాదని, మిడత అని వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది.