విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 3 ప్రాంతాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పడతాయి. తర్లువాడలో పనులు ప్రారంభమవగా, విశాఖ–అనకాపల్లి జిల్లాల్లో 600 ఎకరాలకు పైగా భూమి కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ హబ్తో విశాఖ ఆసియాలో గూగుల్ క్లౌడ్ సేవలకు కీలక గేట్వేగా మారనుంది.