ఘనంగా స్వరనీరాజనం
NEWS May 24,2026 11:10 am
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న చిన్నారులు భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు.ఆలయ ఈఓ, చైర్మన్, అర్చకులు, విద్యార్థుల తల్లిదండ్రులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.