ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
NEWS Jul 24,2026 11:08 am
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ జరగనుంది. జూలై 30 నాటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి నగదు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు.