కోఆపరేటివ్ అధ్యక్షుడిగా విరోతి సత్తిబాబు
NEWS Sep 11,2025 04:07 pm
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో కోఆపరేటివ్ అధ్యక్షుడిగా విరోతి సత్తిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా సమయానికి రుణాలు, విత్తనాలు, ఎరువులు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మునుపటి ఎంపీటీసీగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన అనుభవమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతు సంఘ నాయకులు ఆయన ఎన్నికపై ఆనందం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.