నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
NEWS Apr 09,2026 08:31 pm
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండబోతున్నారు. ఆ ఎలక్షన్స్లో గులాబీ అధినేతకు జీవన్ గట్టి పోటీ ఇచ్చారు. KCRకు 2,69,452 ఓట్లు, జీవన్ రెడ్డికి 2,53,687 ఓట్లు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవట్లేదని ప్రజాభిప్రాయ నిరూపణకు MPగా ఉన్న KCR రిజైన్ చేయడంతో ఉపఎన్నిక జరిగింది.