వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
NEWS Jun 04,2026 12:55 am
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న నాగేష్పై కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాయిజాన్ని ప్రజలు సహించరని హెచ్చరించిన ఎమ్మెల్యే, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగేష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.