బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
NEWS Dec 30,2025 06:50 pm
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను నియమించారు. శాసన మండలిలో ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఉపనేతలుగా నియమితులయ్యారు. అలాగే మండలి విప్గా దేశపతి శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. సోమవారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పార్టీ వ్యూహం సమర్థంగా అమలు చేసేందుకే ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.