‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
NEWS Apr 02,2026 05:30 pm
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, ఎంపీ రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ వాకౌట్ చేసింది. 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ బిల్లుపై చర్చలో పాల్గొనగా.. 10 పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారు.