అయ్యప్పస్వాములకు ముస్లిం సోదరుని భిక్ష
NEWS Jan 01,2026 09:53 pm
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మహ్మద్ ఖుతుబొద్దీన్ పాషా మత సామరస్యానికి నిదర్శనం నిలిచాడు. పట్టణంలోని 25 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం నిర్వహించి, స్వయంగా వడ్డించి, అనంతరం భిక్షగా తీసుకున్నారు. మత భేదాలు లేకుండా సేవ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని పాషా తెలిపారు. ఏటా అయ్యప్ప మాలధారణ సమయంలో ముస్లిం సోదరులు అన్నదానం చేయడం హర్షణీయమని అయ్యప్ప భక్తులు అన్నారు. సమాజానికి ఒక మంచి సందేశం అందించిన ఖుతుబొద్దీన్ పాషా సేవను అందరూ అభినందిస్తున్నారు.