భద్రాచలం వద్ద కళాశాల బస్సు బోల్తా
60 మంది విద్యార్థులకు గాయాలు
NEWS Jan 02,2026 02:14 pm
బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం కాగా, ఆమె పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.