ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్సై వినయ్
NEWS Feb 10,2026 11:07 pm
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఒక ఐటీ కంపెనీ నిర్వాహకుడిపై నమోదైన కేసులో, అతనికి కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఎస్సై వినయ్ లక్ష లంచం డిమాండ్ చేశారు. తొలి విడతగా రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీ ఆశ్రయించడంతో , మధ్యాహ్నం నగదు తీసుకుంటుండగా ఎస్సైని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.