ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
NEWS Feb 14,2026 10:28 pm
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం ఉంజల్ సేవ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించి స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ దేదీప్యమానంగా నిర్వహించారు. మహిళలు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.