మస్కట్లో చనిపోయిన శ్రీనివాస్ మృతదేహం ఇంటికి చేరింది
NEWS Feb 23,2026 07:49 pm
మస్కట్లో ఈనెల 19న మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం వారి స్వగ్రామంలోని ఇంటికి చేరింది. ఈనెల 19 మస్కట్లో కాలు జారిపడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు తెలిపినట్లు ఆ కుటుంబ సభ్యులు మస్కట్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాదాన్ని నింపాయి. శ్రీనివాస్ కు ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.