మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
NEWS Feb 23,2026 08:12 pm
హైదరాబాద్ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో.. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, జూపల్లి సభ్యులు. గత ఏడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో రూ.2 వేల కోట్ల ఈక్విటీని L&Tకి చెల్లించేలా.. రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చిన సంగతి తెలిసిందే.