యుద్ధం ఆపకపోతే ప్రధాని చనిపోయేవాడు
NEWS Feb 25,2026 10:21 am
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ మధ్య యుద్ధమేఘాలను తాను తొలగించానని, తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇరుదేశాల మధ్య పెద్ద యుద్ధం సంభవించేదన్నారు. ఈ యుద్ధం జరిగి ఉంటే కనీసం 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని, పాకిస్థాన్ ప్రధాని కూడా చనిపోయేవారని ట్రంప్ చెప్పారు. తన దౌత్యంతోనే పెనుప్రమాదం తప్పిందని, తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలను ఆపానని తెలిపారు.