ఇ-ఓటింగ్తో ఫోన్ ద్వారా ఓటేయొచ్చు!
NEWS Feb 25,2026 11:14 am
ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి బిహార్ ఎన్నికల సంఘం నాంది పలికింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ ఆధారిత ఇ-ఓటింగ్ విధానాన్ని ప్రదర్శించింది. వలస కార్మికులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ బూత్కు వెళ్లలేక ఓటు హక్కును కోల్పోకుండా, ఇంటి నుంచే స్మార్ట్ఫోన్ ద్వారా ఓటు వేసే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో విజయవంతమైన ఈ విధానాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డిజిటల్ మార్పు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఓటరుకు మరింత దగ్గర చేయనుంది.