మల్లాపూర్ శివారులో స్కూల్ ఆటో బోల్తా... విద్యార్థులకు గాయాలు
NEWS Feb 25,2026 12:40 pm
మల్లాపూర్ మండలంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వాల్కొండ గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులు మల్లాపూర్లోని ప్రైవేటు పాఠశాలకు వెళ్తుండగా, పాఠశాల సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ఆసుపత్రికి మార్చారు.