మంత్రి పొంగులేటితో జర్నలిస్టుల భేటీ
అక్రెడిటేషన్ జీవోను సవరించాలని వినతి
NEWS Feb 25,2026 10:53 am
HYD: అక్రెడిటేషన్ జీవోను సవరించాలని ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రి పొంగులేటికి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులకు సరైన గుర్తింపు కల్పించేలా మార్గదర్శకాలను రూపొందిం చాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. జర్నలిస్టుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని I&PR కమిషనర్ ప్రియాంకను ఆదేశించారు. ఈ సమావేశంలో స్వామి ముద్దం, సిద్దగౌని సుదర్శన్, మేకల కృష్ణ, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి, ఈ.శ్రీనివాస్ రావు, HYD ప్రెస్ క్లబ్ EC మెంబర్ అశోక్ దయ్యాల తదితరులు పాల్గొన్నారు.