భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
NEWS Apr 01,2026 04:10 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన వసంత తీర్థాన్ని చల్లుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊయలలో ఉంచి డోలోత్సవంగా సేవలు చేశారు.కళ్యాణోత్సవం అనంతరం జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో పాటు ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడుతోంది.