రాజా రవివర్మ పెయింటింగ్కు ₹167 కోట్లు
NEWS Apr 02,2026 01:57 pm
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబయిలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు చాలా మంది పోటీపడ్డారు. 1890లలో గీసిన ఈ చిత్రాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఫౌండర్ సైరస్ పూనావాలా దీన్ని దక్కించుకొన్నారు.