పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది పోలీసులను మోహరించారు. సెక్షన్ 144 అమలు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరాటే కళ్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రఘురామ కృష్ణంరాజుపై దాడి కేసులో 67 మందిపై కేసులు నమోదు చేశారు.