అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండలో సోమవారం 15 అడుగుల గిరినాగు కనిపించి రైతులను భయాందోళనకు గురిచేసింది. పొలాలకు వెళ్తున్న సమయంలో ఎదురైన ఈ భారీ పాము వారిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన రైతులు కలిసి కొట్టి చంపేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.