HYD: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ప్రపంచానికే ఆదర్శంగా నిలుపొచ్చవచ్చని అంబేద్కర్ నిరూపించారని సీఎం అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చి దేశాన్ని అభివృద్ధి వైపు నడపవచ్చని చెప్పిన మార్గదర్శి, ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు.