చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
NEWS Apr 14,2026 04:54 pm
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సబీర్ పాషా, కార్పొరేటర్ నమ కీర్తి, సీపీఐ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వేసవి వేడిలో ప్రజలకు తాగునీరు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.