నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన సుమారు 100 మంది 16 సంవత్సరాల తర్వాత విద్యార్థులు కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించారు. పదవ తరగతి తర్వాత ఎక్కడ ఎక్కడ ఉన్నత చదువులు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన విద్యార్థులందరూ ఒక్క చోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.