కామారెడ్డిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య గుండె వైద్యంలో చోటుచేసుకుంటున్న ఆధునిక మార్పులను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో సర్జరీ అవసరం లేకుండానే గుండె వాల్వ్ మార్పిడి చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అలాగే తక్కువ పరిమాణంలో ‘డై’ ఉపయోగించి యాంజియోగ్రామ్ నిర్వహించడం వల్ల రోగులకు మరింత భద్రత లభిస్తుందని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారికి ‘టావి’ (TAVI) విధానం ద్వారా సురక్షిత చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ అత్యాధునిక గుండె చికిత్సలను యశోద హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా అందిస్తున్నారని తెలిపారు.