నర్సాపూర్(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ లలితా శ్రీధర్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పనుల నిమిత్తం బయట పనిచేస్తున్న కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 300 మంది ఉపాధి కూలీలకు మజ్జిగ అందజేసి వారి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతుల సేవాభావాన్ని కూలీలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ బాగరి ముత్యం తదితరులు పాల్గొన్నారు.