బాధితుడి వద్ద ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ
NEWS Jun 02,2026 02:06 pm
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఓ ఫిర్యాదుదారుడు రిసెప్షన్ వద్ద కూర్చొని ఉండగా, ఎస్పీ స్వయంగా ఆయన వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి నుంచి నేరుగా ఫిర్యాదును స్వీకరించిన ఆయన, వెంటనే సంబంధిత అధికారులకు సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ స్పందించిన తీరును అక్కడున్న ప్రజలు అభినందించారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న పోలీస్ శాఖ పనితీరుకు ఇది నిదర్శనంగా నిలిచింది.