సర్పంచ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహప్రవేశం
NEWS Jun 02,2026 02:05 pm
లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్నగర్ కాలనీ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ జర్పల దేవి, పంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చలమల సంధ్య, వార్డు సభ్యులు, లబ్ధిదారులు మిట్టపల్లి శిరీష, ధారావత్ స్రవంతి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గృహప్రవేశ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.