తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చిందని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మాట్లాడిన సీఎం, తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన సోనియా, మన్మోహన్ల కృతజ్ఞతలు తెలిపారు. 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ నెలలోనే మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా నిధులు అందించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.లక్ష కోట్ల రుణాలు అందించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు.