తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఓ తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండటం చాలా బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. తాను కేసీఆర్ బిడ్డనని.. మొండిదాన్ని అని, మంచిదాన్ని అని అన్నారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి.. ఎన్నో ఎత్తుపల్లాలను చూశానన్నారు. కానీ ఈసారి కుటుంబానికి దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.