కోనసీమలో 9 మంది తహసీల్దార్లు బదిలీ
NEWS Aug 28,2024 05:54 pm
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9 మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.జె. ప్రకాశ్ బాబు (ఆలమూరు), మృత్యుంజయరావు(మామిడికుదురు), నాగ లక్ష్మమ్మ (అయినవిల్లి), సిహెచ్ విజయశ్రీ (ఐ.పోలవరం), శ్రీ పల్లవి (పి.గన్నవరం), జీఆర్. ఠాగూర్(మలికిపురం) లను నియమించారు. ఏవో లుగా కె. కాశీ విశ్వేశ్వరరావు, శ్రీదేవి, ఝాన్సీ కుమారి లను నియమించారు.