మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, తనను నమ్ముకున్న కార్యకర్తలను పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. టికెట్ల కేటాయింపులో పార్టీ కోసం పని చేసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి, ఇతర వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. జీవన్ రెడ్డి వద్ద కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. అన్యాయానికి నిరసనగా, టికెట్లు దక్కని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అంటూ శపథం చేశారు.