మెట్పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. అగ్నిప్రమాదంతో 51 గీత కార్మిక కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు.