Logo
Download our app
గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
NEWS   Jul 20,2026 12:04 pm
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, 'వందేమాతరం' గీతాలాపనకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపు. 'వందేమాతరం' గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. మూసాపేట్ పుల్లారెడ్డి పాఠశాలలో జరిగిన సమావేశంలో 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని సమితి వెల్లడి. సంత్ రవిదాస్ 650వ జయంతి, అశోక్ సింఘాల్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. వినాయక ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని నిర్వాహకులకు సూచన. ఉత్సవాలపై జరిగే దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు. మండపాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల నుంచి నిధుల కేటాయింపు, పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. డీజేలకు దూరంగా ఉండి, భజనలు, దేశభక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని యువతకు విజ్ఞప్తి. సెప్టెంబర్ 14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు, 25న నిమజ్జన మహోత్సవం. ఖైరతాబాద్ గణేశ్ ఈసారి 69 అడుగుల 'పంచముఖ సంకటహర మహా గణపతి' రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Top News


LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...
LATEST NEWS   Jul 31,2026 11:15 am
ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత
ప్రముఖ సింగర్ కె. జమునారాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. ఏడేళ్ల ప్రాయంలోనే సినీ ప్రయాణం ప్రారంభించి 5భాషల్లో 6వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె మృతి పట్ల...
LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...
LATEST NEWS   Jul 31,2026 11:08 am
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన,...
LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...
LATEST NEWS   Jul 31,2026 11:00 am
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్‌పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ...
⚠️ You are not allowed to copy content or view source