దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
NEWS Aug 03,2026 01:04 pm
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో వ్యక్తిగత దూషణల సాకుతో ఒక దళిత వ్యక్తి ఇంటిపై పడి దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే, నాయకులపై పోలీసులు చట్టప్రకారం విచారణ జరిపి అరెస్ట్ చేస్తే, దాన్ని అరాచక పాలన అంటూ జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.