వరుస పేలుళ్లతో దుబాయ్ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. పేలుళ్ల కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ పారిశ్రామిక ప్రాంతం పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయం ఉంది. ఈ పేలుళ్లపై యూఏఈ అధికారిక ప్రకటన చేయలేదు.