రీ సర్వేతో భూసమస్యలకు పరిష్కారం
NEWS Aug 05,2026 04:08 pm
సోన్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులు సర్వే సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని కోరారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.