వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
NEWS Aug 06,2026 03:10 pm
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్ అకాడమీ భూమిపూజ అంశాన్ని రాజకీయం చేస్తూ..నారా లోకేష్ క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చాయి. గతంలోనే భూమి పూజ జరిగినా, లోకేష్ కోసం మళ్లీ తంతు జరిపారంటూ తప్పుడు ప్రచారం చేశాయి. అయితే, ఈ ఫేక్ ప్రచారానికి PV సింధు స్వయంగా చెక్ పెట్టారు.