తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం
NEWS Aug 08,2026 06:41 pm
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు అవి ఎంతో అవసరమని కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం కొల్లాపూర్ పట్టణంలోని 6వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బిడ్డ జన్మించిన తొలి గంటలోనే ముర్రుపాలు పట్టించడం వల్ల శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లి తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు అందించాలని సూచించారు.